ప్రముఖ సింగర్ సునీత గత కొన్నేళ్ల క్రితం భర్త కిరణ్తో విడిపోయి తన ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీత మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని వారాలుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ సునీత్ పెళ్లి వార్తని బయటపెట్టింది. `మ్యాంగో` రామ్ ని పెళ్లాడబోతున్నానని. త్వరలోనే ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని సోమవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించి షాకిచ్చింది.
సోమవారం సింగర్ సునీతకు సంబంధంచిన రెండవ పెళ్లి నిశ్చితార్థం `మ్యాంగో` అధినేత రామ్తో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు బయటికి రావడంతో సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన వార్త వైరల్గా మారింది. ఈ పెళ్లికి సునీత పిల్లలు, తల్లిదండ్రులు అంగీకరించడంతో సోమవారం పిల్లలు, తల్లిదండ్రుల సాక్షిగా సునీతకు రామ్తో ఎంగేజ్మెంట్ జరిగింది.
పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఈ నెల 27న సునీత, రామ్ వీరపనేని ( మ్యాంగో రామ్) ల వివాహానికి మూహూర్తం ఫిక్స్ చేశారు. ఇద్దరికీ ఇది రెండవ పెళ్లి కావడంతో హైదరాబాద్లో జరగనున్న వీరి వివాహానికి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారట.