లాక్డౌన్ మే 7 వరకు పొడిగించడంతో అప్పటికైనా థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మార్చి, ఏప్రిల్లో రిలీజ్కు సిద్ధమైన చిత్రాల్లో చాలా వరకు థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీ ద్వారా రిలీజ్కి సిద్ధమవుతున్నాయంటూ ఇటీవల వరుస కథనాలు వినిపిస్తున్నాయి. నిశ్శబ్దం, రెడ్, ఒరేయ్ బుజ్జిగా` వంటి చిత్రాలు డైరెక్ట్గా డిజిటల్ ప్లాట్ ఫామ్లోనే రిలీజ్ కాబోతున్నాయని ప్రచారం జరిగింది.
అందులో ఎలాంటి నిజం లేదని చిత్ర నిర్మాతలు వివరణ కూడా ఇచ్చారు. తాజాగా మరో సినిమాపై వరుస రూమర్లు వినిపిస్తున్నాయి. నాని, సుధీర్బాబు తొలిసారి కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ `వి`. నివేదా థామస్, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించారు. ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్లో రిలీజ్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.
తాజాగా
`ఓటీటీ ప్లాట్ ఫామ్లలో సినిమాలను రిలీజ్ చేయడానికి మా హీరోలకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఈ డిజిటల్ కంపెనీల నుంచి మా పెట్టుబడులు తిరిగి పొందడం గురించి నిర్మాతలకు ఖచ్చితమైన ఐడియా లేదు. మరికొంత సమయం వేచి చూడాలని మేమంతా నిర్ణయించుకున్నాము ` అని దిల్ రాజు స్పష్టతనిచ్చారని తెలిసింది.