Homeగాసిప్స్దిల్ రాజు ఎందుకు రాజ్ తరుణ్ ని భరిస్తున్నాడు

దిల్ రాజు ఎందుకు రాజ్ తరుణ్ ని భరిస్తున్నాడు

దిల్ రాజు ఎందుకు రాజ్ తరుణ్ ని భరిస్తున్నాడు
దిల్ రాజు ఎందుకు రాజ్ తరుణ్ ని భరిస్తున్నాడు

సొంతంగా తన కష్టంగా పైకి ఎదిగిన హీరో రాజ్ తరుణ్. సాదాసీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన రాజ్ తరుణ్ మొదట్లో హిట్లు అందుకుని స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. రాజ్ తరుణ్ మొదట చేసిన ఉయ్యాలా జంపాల మంచి హిట్టైంది. చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన ఈ చిత్రం అందరినీ అలరించింది. తర్వాత చిత్రం సినిమా చూపిస్త మావ అయితే మాస్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విజయం రాజ్ తరుణ్ ను ప్రామిసింగ్ హీరోగా నిలబెట్టింది. ఇక సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21ఎఫ్ కూడా సూపర్ హిట్ అయింది. దాంతో రాజ్ తరుణ్ కు ఇక తిరుగులేదనుకున్నారు. అయితే ఈ సంబరం ఎన్నాళ్ళో కాదని త్వరగానే తెలిసొచ్చింది. రాజ్ తరుణ్ చేసిన సినిమాలన్నీ ఒకటి తర్వాత ఒకటిగా ప్లాప్స్ గా మిగిలాయి. రీసెంట్ గా వచ్చిన లవర్ చిత్రమైతే అడ్రస్ కూడా లేకుండా ప్లాప్ అయింది. ఈ దెబ్బతో రాజ్ తరుణ్ ఫెడౌట్ అయ్యే స్టేజ్ కు చేరుకున్నాడు. మరో ఉదయ్ కిరణ్, తరుణ్ తరహాలో రాజ్ తరుణ్ కెరీర్ కూడా సైడైపోతుందా అనే అనుమానాలు వచ్చాయి.

అయితే రాజ్ తరుణ్ తో లవర్ సినిమా తీసి చేతులు కాల్చుకున్న దిల్ రాజు ఎవరికీ అర్ధం కాని విధంగా మరోసారి రాజ్ తరుణ్ తోనే సినిమాను తీస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో కొత్త దర్శకుడు జీఆర్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఇద్దరి లోకం ఒకటే డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని నవంబర్ లోనే విడుదల చేద్దామనుకున్నా దిల్ రాజు క్రిస్మస్ సెలవులు కలిసివస్తాయన్న నమ్మకంతో డిసెంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయించాడు. ఇదంతా బానే ఉంది కానీ దిల్ రాజు లెక్కల విషయంలో కచ్చితంగా ఉండే వ్యక్తి. తన నిర్ణయాలు కూడా ఎక్కువగా సరిగ్గా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఎందుకని అసలు మార్కెట్ కోల్పోయిన రాజ్ తరుణ్ తో సినిమా తీస్తున్నాడు అనే అనుమానం వచ్చింది. విషయంలోకి వెళితే.. దిల్ రాజు రాజ్ తరుణ్ తో చేసుకున్న మూడు సినిమాల అగ్రిమెంట్ దీనికి కారణమని తెలుస్తోంది. అందులో భాగంగా ముందు లవర్, ఇప్పుడు ఇద్దరి లోకం ఒకటే సినిమాలను నిర్మించాడు. మరో సినిమా కూడా త్వరలో పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నాడు దిల్ రాజు. అదీ కాకుండా నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువ థియేటర్లు దిల్ రాజు కనుసన్నల్లోనే నడుస్తాయన్న విషయం తెల్సిందే.

- Advertisement -

థియేటర్లకు ఫీడింగ్ ఇవ్వడానికైనా ఈ చిత్రాలు పనికొస్తాయని దిల్ రాజు ఆశిస్తున్నాడు. ఎలాగు ఈ చిత్రాలను తనే పంపిణీ చేస్తాడు కాబట్టి లాభమైనా, నష్టమైనా తనే భరించొచ్చు. అందుకే అగ్రిమెంట్ ను అలాగే ఉంచాడు. రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే కాకుండా మరో చిత్రంలో నటిస్తున్నాడు. అది ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కనుక మళ్ళీ హిట్ అయితే రాజ్ తరుణ్ కెరీర్ మళ్ళీ పుంజుకునే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All