ఉయ్యాల జంపాల సినిమాతో సింపుల్ ఎంట్రీ ఇచ్చిన యువ హీరో రాజ్ తరుణ్ రెండవ సినిమాతోనే బాక్స్ ఆఫీస్ సినిమా చూపించాడు. కుమారి 21F తో మరో ట్రేడ్ మార్క్ హిట్ అందుకున్న యువ హీరో ఆ తరువాత వచ్చిన అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటు వెళ్ళాడు. మొదటి మూడు సినిమాలు తప్పితే ఆ తరువాత ఒక్క సినిమా కూడా ఈ హీరోకి అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. కొన్ని అయితే దారుణమైన నష్టాలను మిగిల్చాయి.
ఇక ఇప్పుడు పోయిన మార్కెట్ ని సెట్ చేసుకోవడానికి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. చివరగా లవర్ సినిమాతో వచ్చిన రాజ్ తరుణ్ నెక్స్ట్ ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాను రిలీజ్ చేయనున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో శిరీష్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. మొదట నవంబర్ 9న రిలీజ్ అనుకున్నారు. ఆ తరువాత డిసెంబర్ 22 అనుకున్నారు. అవేవి సెట్టవ్వలేదు. ఫైనల్ గా కొత్త డేట్ సెట్ చేసుకున్న రాజ్ తరుణ్ ఎలాగైనా ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవలని స్పెషల్ గా ప్రమోషన్స్ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్రాండ్ తప్పితే ఇప్పటి వరకు సినిమాకు పెరిగిన బజ్ ఏమి కనిపించడం లేదు. వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న రాజ్ తరుణ్ కి ఇప్పుడు హిట్టు చాలా అవసరం. సో ఈ సినిమాపైన చాలా ఆశలు పెట్టుకున్నాడు. అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు GR కృష్ణ దర్శకత్వం వహించాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. ఇక రాజ్ తరుణ్ ఈ సినిమా తరువాత గుండెఝారి గల్లంతయ్యిందే ఫేం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో లవ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
- Advertisement -