తన గ్లామర్ తో అబ్బా ! అనిపించిన భామ హెబ్బా పటేల్ కుమారి 21 F తో తెలుగులో సంచలనం సృష్టించింది . సుకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి మళ్ళీ ఇన్నాళ్లకు సీక్వెల్ రెడీ అయ్యిందని తెలుస్తోంది . అసలు కుమారి 21 f సక్సెస్ అయ్యాక వెంటనే సీక్వెల్ ఉంటుందని అన్నారు కానీ అది వాయిదాపడుతూనే ఉంది . కట్ చేస్తే ఇన్నాళ్లకు స్క్రిప్ట్ పక్కాగా రూపొందిందట.
కుమారి 21F కు దర్శకత్వం వహించిన సూర్యప్రతాప్ ఈ సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం హీరోయిన్ అన్వేషణలో ఉన్నారట సుకుమార్ . శివాత్మిక అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నాడట . త్వరలోనే హీరోయిన్ ని ఫైనల్ చేసాక కుమారి సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది .
- Advertisement -