Homeగాసిప్స్క్రిస్మస్ బరిలోకి దిగిన రాజ్ తరుణ్ - అంతా దిల్ రాజు ప్లానింగ్

క్రిస్మస్ బరిలోకి దిగిన రాజ్ తరుణ్ – అంతా దిల్ రాజు ప్లానింగ్

క్రిస్మస్ బరిలోకి దిగిన రాజ్ తరుణ్ - అంతా దిల్ రాజు ప్లానింగ్
క్రిస్మస్ బరిలోకి దిగిన రాజ్ తరుణ్ – అంతా దిల్ రాజు ప్లానింగ్

ఏదైనా దిల్ రాజు ప్లానింగ్ వేరుగా ఉంటుంది. అందుకే ఇన్నేళ్ళుగా దిల్ రాజు విజయవంతమైన నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగగలుగుతున్నాడు. ఏడాదికి ఆరేడు సినిమాలు కూడా రిలీజ్ చేయగల దమ్మున్న నిర్మాతగా పేరొందిన దిల్ రాజు వాటి రిలీజ్ లను ఒకటిదానికొకటి క్లాష్ అవ్వకుండా మంచి సీజన్ చూసి విడుదల చేసుకోగలడు. అందుకే దిల్ రాజుకు సక్సెస్ రేట్ ఎక్కువ. ఇప్పుడు ఈ ఉదాహరణ ఎందుకంటే ప్రస్తుతం దిల్ రాజు డైరెక్ట్ గా నిర్మాణంలో భాగమైన రెండు సినిమాలు ఇద్దరి లోకం ఒకటే, 96 రీమేక్ ల రిలీజ్ డేట్ లను చాకచక్యంగా మార్చి తన నేర్పరితనాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇద్దరి లోకం ఒకటే. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం నవంబర్ లో విడుదల కావాల్సి ఉంది. అయితే నవంబర్ రిలీజ్ అంటే మార్కెట్ కూడా అంత సహకరించదు. అయితే డిసెంబర్ కు రిలీజ్ డేట్ మారుద్దాం అనుకుంటే దిల్ రాజు నిర్మాణంలోనే శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 96 రీమేక్ ఉండనే ఉంది. ఈ చిత్రంపై దిల్ రాజు చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఎంతో ఇష్టపడి ఈ సినిమా హక్కులను కొనుక్కుని ఒరిజినల్ డైరెక్ట్ చేసిన దర్శకుడినే ఏరి కోరి ఈ సినిమాకు పెట్టుకున్నాడు. అయితే అనుకోకుండా ఈ సినిమా షెడ్యూల్స్ లో తేడా వచ్చేసింది. సమంత పార్ట్ షూటింగ్ పూర్తయింది కానీ శర్వానంద్ వి బ్యాలెన్స్ ఉన్నాయి. డిసెంబర్ రిలీజ్ కాబట్టి ఈలోగా షూట్ చేసేద్దామా అంటే శర్వానంద్ డేట్స్ ఖాళీగా లేవు. నవంబర్ అంతా ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది. సో, 96 రీమేక్ డిసెంబర్ రిలీజ్ ను అందుకోవడం కష్టమే.

ఇక చేసేదేం లేక 96 రీమేక్ రిలీజ్ ను ఫిబ్రవరికి మార్చేశాడు దిల్ రాజు. ఈలోగా శర్వానంద్ కూడా ఫ్రీ అవుతాడు కాబట్టి డిసెంబర్ లో షూట్ చేసుకుని తీరిగ్గా ఫిబ్రవరికి రిలీజ్ పెట్టుకోవచ్చు. జనవరిలో కూడా రిలీజ్ ల హడావిడి ఎక్కువగా ఉంది. దిల్ రాజు నిర్మాణంలో ఇన్వాల్వ్ అయిన సినిమాలే రెండు ఉన్నాయి. ఈ హడావిడిలో ఒకదానికొకటి క్లాష్ అవ్వకుండా ఫిబ్రవరి అంటే సినిమాల రిలీజ్ లు తక్కువ ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి నెలకు 96 రీమేక్ ను షిఫ్ట్ చేసాడు.

- Advertisement -

కాబట్టి, ఇప్పుడు తన ఖాతాలో ఉన్న డిసెంబర్ స్లాట్ ఖాళీగా ఉంది కాబట్టి అందులోకి ఇద్దరి లోకం ఒకటేను రిలీజ్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఆ రకంగా అన్ సీజన్ లో రిలీజ్ కావాల్సిన ఇద్దరి లోకం ఒకటే ఇప్పుడు క్రిస్మస్ కు రిలీజవుతోంది. ఆల్రెడీ డిసెంబర్ 20న నందమూరి బాలకృష్ణ, రూలర్, సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే చిత్రాలు రిలీజ్ డేట్స్ ప్రకటించేసుకుని ముస్తాబవుతున్నాయ. అదే రోజు విడుదల చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి డిసెంబర్ 25న ఇద్దరి లోకం ఒకటేను విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయించాడు. ఇలా అయితే డిసెంబర్ 25, జనవరి 1, మొదటి వారంలో రెండు రోజులు పబ్లిక్ హాలిడేస్ వస్తాయి. సో వర్కౌట్ అవుతుందని అని ఆశపడుతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All