తమిళ్ లో సూపర్ స్టార్స్ గా కోట్లాది మంది అభిమానాన్ని గెలుచుకున్న ధనుష్, విజయ్ లు తెలుగులో సినిమాలను చేయడానికి సమాయత్తమవుతోన్న విషయం తెల్సిందే. ధనుష్ స్ట్రైట్ తెలుగు చిత్రం ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. అలాగే విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో నటిస్తాడు.
అయితే ఈ చిత్రాలు 2022లోనే షూటింగ్ మోడ్ లోకి వెళతాయని టాక్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. దాని తర్వాత ధనుష్ చిత్ర ఫైనల్ డ్రాఫ్ట్ మీద వర్క్ చేయాల్సి ఉంది. ఏప్రిల్ 2022లో ఈ చిత్రం షూటింగ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు ధనుష్ తన తమిళ చిత్రాల కమిట్మెంట్స్ ను పూర్తి చేసుకుంటాడు.
విజయ్ విషయంలో దాదాపు ఇదే ఉంటుంది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ కు తుదిమెరుగులు దిద్దుతున్నాడు. వచ్చే జనవరిలో సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.