టాలెంటెడ్ హీరో ధనుష్ కోలీవుడ్ లో టాప్ స్థానాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తమిళ సినిమాలతో పాటు అడపాదడపా హిందీ చిత్రాల్లో కూడా నటిస్తాడు ధనుష్. ఈ మధ్యే ఒక ఇంగ్లీష్ చిత్రాన్ని కూడా పూర్తి చేసాడు. అయితే ఇప్పటివరకూ ఒక్క తెలుగు చిత్రం కూడా చేయని ధనుష్ ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలు సైన్ చేసాడు.
ఇప్పటికే ఏషియన్ సినిమాస్ బ్యానర్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేసారు. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా సినిమాను చేయనున్నాడు. వెంకీ అట్లూరి దీనికి దర్శకుడు. ఈ రెండు చిత్రాలను సమాంతరంగా చేస్తాడు ధనుష్.
వీటితో పాటు మరో ఇద్దరు నిర్మాతల దగ్గర ధనుష్ అడ్వాన్స్ లు తీసుకున్నట్లు సమాచారం. డివివి దానయ్య రికార్డ్ అమౌంట్ ను ధనుష్ కు అడ్వాన్స్ గా ఇచ్చి డేట్స్ బ్లాక్ చేసుకున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా ధనుష్ తో ప్రాజెక్ట్ ను ఓకే చేసుకున్నారు. ఈ రెండు బ్యానర్స్ కు దర్శకులు ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది.