Homeటాప్ స్టోరీస్ధనుష్ కు మద్రాస్ హైకోర్టు మొట్టికాయల!

ధనుష్ కు మద్రాస్ హైకోర్టు మొట్టికాయల!

ధనుష్ కు మద్రాస్ హైకోర్టు మొట్టికాయల!
ధనుష్ కు మద్రాస్ హైకోర్టు మొట్టికాయల!

ట్యాక్స్ విషయంలో మినహాయింపు అడిగినందుకు గాను సినీ నటుడు ధనుష్ కు మద్రాస్ హైకోర్టు మొట్టికాయలు వేసింది. వివరాల్లోకి వెళితే 2015లో రోల్స్ రాయిస్ కార్ ను కొనుగోలు చేసాడు ధనుష్. ఆ కార్ కు సంబంధించిన దిగుమతి సుంకాన్ని చెల్లించకుండా తనకు మినహాయింపు కావాలని కోరుతూ ధనుష్ పిటీషన్ దాఖలు చేసాడు. ఈరోజు ఆ కేసు హియరింగ్ కు వచ్చింది.

మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ధనుష్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. “50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్న వ్యక్తి కూడా ట్యాక్స్ కడుతున్నాడు. మరి మీకెందుకు ఇవ్వాలి ట్యాక్స్ మినహాయింపు. మీరు ఇంపోర్ట్ చేసుకునే కార్లు ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఇచ్చిన డబ్బుతో వేసిన రోడ్లపై తిరుగుతాయి. మరి మీరు ఎందుకు మినహాయింపు అడుగుతున్నారు” అని గట్టిగా చురకలు అంటించింది.

- Advertisement -

ధనుష్ తరపు న్యాయవాది కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే 50 శాతం ట్యాక్స్ కట్టామని, మిగిలిన అమౌంట్ ను త్వరలోనే చెల్లిస్తామని తెలిపాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All