మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు సెప్టెంబర్ 10న యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే. అప్పటినుండి అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అపోలో హాస్పిటల్ బులెటిన్ ప్రకారం తేజ్ కోలుకుంటున్నాడని కొన్ని రోజుల క్రితం అప్డేట్ వచ్చింది. అయితే ఆ తర్వాత నుండి ఎటువంటి అప్డేట్ లేదు. తీరా చూస్తే రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అక్కడ తేజ్ కోమాలో పడి ఉన్నాడని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
అసలు తేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? ఏదైనా దాస్తున్నారా? అని కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే తేజ్ ఆరోగ్యం విషయంలో కంగారు పడాల్సిన పనిలేదని తెలుస్తోంది. దేవా కట్టా ఇటీవలే ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ తేజ్ తో యాక్సిడెంట్ తర్వాత మాట్లాడానని, తేజ్ స్వయంగా అక్టోబర్ 1న చిత్రాన్ని రిలీజ్ చేయమని కోరాడని దేవా కట్టా అన్నాడు.
అలాగే రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా తేజ్ చూశాడని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు సోషల్ మీడియాలో ఎస్ ఎస్ థమన్ కూడా మాట్లాడుతూ తేజ్ మ్యానేజర్ సతీష్ తో మాట్లాడనని తేజ్ బాగున్నాడని, త్వరలోనే కలుస్తానని అన్నాడు.
All your prayers are working ❤️
My nanban @IamSaiDharamTej is recovering ❤️? So well thanks @bkrsatish for the update . I am so excited to meet mY dear nanban in couple of days ⭐️#GetWellSoonSDT love u Nanba?— thaman S (@MusicThaman) September 30, 2021