సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమా విడుదలకు సిద్ధమైంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చిత్రంపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు. అయితే రజినీకాంత్ కు తెలుగులో మార్కెట్ దూరమైంది అనడం సమంజసమే. గత కొన్ని చిత్రాలుగా రజిని తనవి కాని సినిమాలు చేయడం, తమిళ ఫ్లేవర్ ను ఎక్కువగా వాడడం వంటి కారణాలతో తెలుగు మార్కెట్ పై పట్టుని కోల్పోయాడు. గతంలో ఇక్కడి స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో రజని సినిమాలు బిజినెస్ చేసేవి. కానీ ప్రస్తుతం మిడ్ రేంజ్ హీరోల మార్కెట్ కన్నా తక్కువకు రజినీ తెలుగు మార్కెట్ డౌన్ అయింది. అయితే రజినికాంత్ ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈసారి రజినీకాంత్ కు తోడు మురుగదాస్ కూడా ఉన్నాడు. మురుగదాస్ కు కూడా ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ లేదు. అయినా కానీ కమర్షియల్ సినిమాలపై తనకున్న పట్టు ఎప్పుడూ ప్లస్ అవుతుంది.
దర్బార్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. పాటలు కూడా బాగున్నాయి అని పేరు తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 9కి విడుదల కానున్న ఈ చిత్రం ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కేవలం రెండే రోజుల్లో సంక్రాంతి పుంజులు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాయి. అందుకే దర్బార్ కు ఉన్నవి రెండే రోజులు. తర్వాత థియేటర్లు అన్నీ ఆ రెండు చిత్రాలే కమ్మేస్తాయి.
ఒకసారి దర్బార్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ వివరాలు చూసుకుంటే…
నైజాం: Rs 5.2 Cr
సీడెడ్: Rs 3 Cr
ఆంధ్రప్రదేశ్: Rs 6 Cr
రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం : Rs 14.2 Cr
సో, దర్బార్ హిట్ కావాలంటే 15 కోట్లు రాబట్టాలి. రజినీకాంత్ గత చిత్రం పేటకు డీసెంట్ టాక్ వచ్చినా కానీ 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ రికవర్ చేయడానికి నానా కష్టాలు పడింది. మరి దర్బార్ తో ఏం జరుగుతుందో చూడాలి.