కరోనా మహమ్మారి వరల్డ్ వైడ్గా కరాళ నృత్యం చేస్తోంది. చైనాలోని పుహాన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతూ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఇప్పటికే ఇటలీ లాంటి దేశంలో జనం దీని బారిన పడి కుప్పలు తెప్పలుగా ప్రాణాలు విడుస్తున్నారు. పుహాన్లో పుట్టిన నిర్లక్ష్యం కారణంగా ఇటలీని బలితీసుకుంటోంది. ఇటలీ చేసిన తప్పదం ఏ దేశం చేయకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పలు మార్లు దేశాధినేతల్ని హెచ్చరిస్తోంది.
ఇదిలా వుంటే దేశంలో దీని ప్రభావం చిన్న చిన్నగా చాపకింద నీరులా వ్యపిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలే కరోనాని కట్టడి చేయలేక కకావికలం అవుతున్న వేళ ఈ మహమ్మారి భారత్లో ప్రబలితే అదుపు చేయడం కష్టమని భావించిన దేశ ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూని తెరపైకి తీసుకొచ్చారు. అది కూడా ప్రభావం చూపించకపోవడంతో ఏప్రిల్ 15 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది జీవితం దుర్భరంగా మారింది.
నిత్యావసర వస్తువులు అందక జనం విలవిలలాడుతున్నారు. అయితే ఈ ప్రకృతి విపత్తు నుంచి ప్రజల్ని రక్షింయచడానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషిని కొనియాడుతున్న సెలబ్రిటీలు స్వచ్ఛందంగా సీఎం రిలీఫ్ ఫండ్కు తమ వంతు బాధ్యతగా విరాళాలు ప్రకటిస్తున్నారు. యంగ్ హీరో నితిన్ తో ఈ విరాళాల పరంపర మొదలైంది. తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు ప్రకటించిన జనసేనా అధినేత, హీరో పవర్స్టార్ పవన్కల్యాణ్ పీఎం రిలీఫ్ ఫండ్కు కూడా కోటి రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం అభినందనీయం. ఏపీ సీఏం సహాయనిధికి 50 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి 50 లక్షలు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పీఎంకు, ఇరు రాష్ట్రాల సీఎంలకు పవన్ అందించనున్నారట.
I will be donating Rs.50 Lakhs each to both AP and Telangana CM relief funds to fight against Corona pandemic.
— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020
I will be donating Rs.1 crore to PM relief fund to support our https://t.co/83OmZ9biYX Sri @narendramodi ji,in turbulent times like this. His exemplary and inspiring leadership would truly bring our country from this Corona pandemic.
— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020
Credit: Twitter