Homeటాప్ స్టోరీస్నితిన్ గ్రేట్ మూవ్‌.. సీఎంల స‌హాయ‌నిధికి విరాళం!

నితిన్ గ్రేట్ మూవ్‌.. సీఎంల స‌హాయ‌నిధికి విరాళం!

నితిన్ గ్రేట్ మూవ్‌.. సీఎంల స‌హాయ‌నిధికి విరాళం!
నితిన్ గ్రేట్ మూవ్‌.. సీఎంల స‌హాయ‌నిధికి విరాళం!

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి ఏ దేశం, కులం, మ‌తం, ప్రాంతంతో సంబంధం లేదు. కంటికి క‌నినించ‌ని మాన‌వాళి శ‌త్రువు క‌రోనా. ఈ పేరు ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌ని గ‌జ్జున వ‌ణికిస్తోంది. ఇటీలో దీని పంజాకు ప్ర‌జ‌లంతా పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు చెప్పినా విన‌ని ఇటాలియ‌న్లు ఇప్పుడు ఘోర ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.

దేశాల్లో చిన్న‌ చిన్నగా క‌రోనా మ‌ర‌ణాలు పెరుగుతున్నాయి. ఇదొక ప్ర‌కృతి విల‌యంగా మారుతోంది. ల‌క్ష‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌వించే అవ‌కాశం వుంద‌ని ఎంత మంది ఎన్నిర‌కాలుగా హెచ్చ‌రించినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించాయి. దీంతో అంతా బంద్ పాటిస్తున్నారు. క‌రోనా వ్యాప్తి నిరోధానికి డాక్ట‌ర్లు, న‌ర్సులు ఆహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. దీని కోసం హీరో నితిన్ ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు త‌న వంతు స‌హాయంగా 20 ల‌క్ష‌లు ఆర్థిక స‌హాయాన్ని ఇద్ద‌రు సీఎంల స‌హాయ‌నిధికి విరాశం ప్ర‌క‌టించారు.

- Advertisement -

క‌రోనా క‌ట్ట‌డికి రెండు రాష్ట్రాలు చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తున్నాయని, వారికి మ‌న వంతు బాధ్య‌త‌గా స‌హ‌క‌రించాల‌ని, ప్ర‌జ‌లంద‌రూ ప్ర‌భుత్వం చెబుతున్న జాగ్ర‌త్త‌ల్ని పాటిస్తూ ఇంటి ప‌ట్టునే వుండాల‌ని నితిన్ ఈ సంద‌ర్భంగా సూచించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All