కరోనా కారణంగా ఓటీటీల బిజినెస్ ఊపందుకుంటోంది. అంతా ఇంటిపట్టునే వుండటంతో జనాలంతా వినోదం కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్లని నమ్ముకుంటున్నారు. దీంతో వీటికి ఈ మధ్య కాలంలో డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్గోపాల్వర్మ సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ని సిద్ధం చేశాడు.
ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో కొత్త డిజిటల్ వరల్డ్ని సృష్టిస్తున్నారు. శ్రేయాస్ యాప్ ద్వారా తన ఆన్ లైన్ వరల్డ్ని ప్రారంభిస్తున్నారు. మియా మాల్కోవాతో `జీఎస్టీ` పేరుతో సంచలనం సృష్టించిన వర్మ తాజాగా మరోసారి మియా మాల్కోవానే నమ్ముకుని చేసిన చిత్రం `క్లైమాక్స్`. ఇటీవలే ఈ చిత్ర టీజర్ని రిలీజ్ చేసి రచ్చ చేసిన వర్మ ఈ చిత్రాన్ని RGVWorldTheatre లో ఈ నెల 29న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నానని, ఈ సినిమాని ఆ దేవుడు కాదు కదా సాక్షాత్తు కరోనా దిగివచ్చినా ఆపలేదని స్పష్టం చేశారు.
మియా మాల్కోవా నటించిన `క్లైమాక్స్` సినిమా రిలీజ్ అవుతున్న శ్రేయాస్ ఈటీ యాప్లో వస్తున్న ఆర్జీవీ థియేటర్ని ఆహా అని ఫ్యామిలీలు ఎవ్వరూ అనరు ఎందుకంటే ఫ్యామిలీల కోసం ఫ్యామిలీలు పెట్టిన ఆహా అనిపించుకోవడం మేము కేర్ చేయమని, యాప్లో వస్తున్న ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో రియల్ ప్యామిలీ యాప్ అంటే దానర్థం ఫ్యామిలీలో అందరూ ఒక్కొక్కరుగా ఆళ్ల వాళ్ల రూముల్లో వాళ్ల రియల్ ఫీలింగ్స్తో చూసుకునే లాంటి కంటెంట్ ఉంటుందిస `అని ట్వీట్ చేశారు.