వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 1988లో ఓ పుస్తకాల పురుగు అని అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి. సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా కీరవాణికి, ఆర్జీవీకి మధ్య సరదా సంభాషణ జరిగింది. కీరవాణి ముందుగా స్పందించారు. ఆర్జీవీ పుస్తకాల పురుగు అని అయితే తను ప్రస్తుతం ఆయన కరోనా పురుగు గురించి తెలుసుకునే క్రమంలో చాలా బిజీగా వున్నారన్నారు.
సర్ ఇప్పటికీ మీరు స్టీఫెన్ హాకింగ్ రచనలను చదువుతున్నారా? అని ఆర్జీవీని ప్రశ్నించారు. దీనికి రామ్ గోపాల్ వర్మ సరదాగా స్పందించారు. `లేదు సార్ ఆయన రచనలు చదవడం లేదు. ఆయన రాసిన కల్పిత కథల కంటే మన జీవితమే చాలా భయంకరంగా ఉంది` అని ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ ప్రభావం మొదలైన దగ్గరి నుంచి రామ్గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా పలు పోస్ట్లు కరోనా వైరస్పై పెడుతూనే వున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎలాంటి విపత్కర వాతావరణంలో వున్నామో చాలా మందికి తనదైన శైలిలో వెల్లడించే ప్రయత్నం చేశారు.
The @RGVzoomin I knew in 1988 was a Pusthakaala Purugu. Now he is busy analysing Corona purugu? Sir, are you still reading Stephen King ?
— mmkeeravaani (@mmkeeravaani) April 24, 2020
Credit: Twitter