`అజ్ఞాతవాసి` పరాజయం తరువాత కంప్లీట్గా సినిమాలకు బ్రేకిచ్చేశారు పవన్కల్యాణ్. రెండేళ్ల విరామం సమయంలో ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఏపీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ పేరుతో పోటీ చేశారు. తాజాగా మరోసారి కెమెరా ముందుకొచ్చారు పవన్కల్యాణ్. ఆయన `పింక్` ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్రాజు, బోనీకపూర్తో కలిసి నిర్మిస్తున్నారు.
ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి పవన్ మార్కు అంశాల్ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనితో పాటు పవన్ మరో చిత్రాన్ని కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఓ బందిపోటు దొంగ కథ నేపథ్యంలో పిరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని త్వరలో తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటిస్తారని, వారి కోసం క్రిష్ అన్వేషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి కీరవాణి జత చేరినట్టు తెలిసింది. చారిత్రక చిత్రం కావడంతో దీనికి కీరవాణి అయితేనే బాగుంటుందని క్రిష్ భావిస్తున్నారట. ఇప్పటికే ఆయనతో క్రిష్ చర్చలు జరిపారని, కీరవాణి కూడా ఓకే చెప్పినట్టు తాజా న్యూస్. కీరవాణి ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్` చిత్రానికి వర్క్ చేస్తున్నారు.