పవర్స్టార్ పవన్కల్యాణ్ తెరపై మెరుపులు మెరిపించి రెండేళ్లవుతోంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన `అజ్ఞాతవాసి` తరువాత పవన్ మరో సినిమా చేయలేదు. ఆయన వెండితెరపై కనిపిస్తే ఈళ వేయాలని గోల చేయాలని, కర్ పేపర్స్తో థియేటర్స్ స్క్రీన్స్ని వర్ణరంజితం చేయాలని పవర్స్టార్ ఫ్యాన్స్ గత రెండేళ్లుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించి పవన్ మళ్లీ నటించడం మొదలుపెట్టారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `వకీల్సాబ్`.
హిందీ హిట్ చిత్రం `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీకపూర్తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీలక పాత్రల్లో లావణ్య త్రిపాఠి, నివేదా థామస్, అంజలి, ప్రకాష్రాజు నటిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే మే 15న సరిగ్గా ఈ రోజే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ విధి మరోలా ప్లాన్ చేసింది. కరోనా యావత్ ప్రపంచాన్నే తన గుప్పిట్లోకి తీసుకుంది. ఈ సినిమా రిలీజ్ని వాయిదా పడేలా చేసింది.
దీంతో నిరుత్సాహానికి గురైన ఫ్యాన్స్ `వకీల్సాబ్` రిలీజ్ ప్లాన్ చేసిన ఈ రోజున సోషల్ మీడియాలో హంగామా మొదలుపెట్టారు. ఈ రోజు ఉదయం నుంచి పవన్ ఫ్యాన్స్ మీమ్స్తో సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. పలు హిట్ చిత్రాల్లోని డైలాగ్లని ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సందర్భానికి, వారు పడుతున్న బాధకు అన్వయించుకుని పోస్ట్ చేస్తున్న మీమ్స్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.