ఈ నెల 20వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ మీటింగ్ షెడ్యూల్ అయిన విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మీటింగ్ కోసం ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ ను చిరు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్.. ఇలా టాప్ స్టార్స్ ను ఈ మీటింగ్ కు ఆహ్వానించాడట. స్టార్స్ అందరూ కూడా మీటింగ్ కు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎవరెవరు మీటింగ్ కు హాజరవుతారు అన్నది ఇప్పుడే చెప్పలేం.
ఇక వారితో పాటు దర్శకులు కొరటాల శివ, ఎస్ ఎస్ రాజమౌళి తదితరులు, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి వారు ఈ మీటింగ్ కు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్స్ తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సడలించాలని తెలుగు ఇండస్ట్రీ ప్రభుత్వాన్ని కోరనుంది. కరోనా కారణంగా ఇప్పటికే ఇండస్ట్రీ చాలా నష్టపోయింది.