Homeగాసిప్స్`ఆచార్య‌` కోసం చ‌ర‌ణ్ మారేడుమిల్లికి వెళుతున్నారా?

`ఆచార్య‌` కోసం చ‌ర‌ణ్ మారేడుమిల్లికి వెళుతున్నారా?

`ఆచార్య‌` కోసం చ‌ర‌ణ్ మారేడుమిల్లికి వెళుతున్నారా?
`ఆచార్య‌` కోసం చ‌ర‌ణ్ మారేడుమిల్లికి వెళుతున్నారా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ్యాట్రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆల‌య భూముల స్కామ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

కోకాపేట‌లో ప్ర‌త్యేకంగా వేసిన విలేజ్ సెట్‌లో ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇటీవ‌లే చిరు, కాజ‌ల్ పాల్గొన‌గా ఓ పాట‌ని పూర్తి చేశారు. ప్ర‌స్తుంత ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ రాడిక‌ల్ భావాజాలం వున్న ప‌వ‌ర్‌ఫుల్ న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఈ పాత్ర‌కు సంబంధించిన కీల‌క షెడ్యూల్ త్వ‌ర‌లో రాజ‌మండ్రి స‌మీపంలోని మారేడు మ‌ల్లి డీప్ ఫారెస్ట్‌లో ప్రారంభం కాబోతోంద‌ని తెలిసింది. ఇందులో న‌క్స‌లైట్‌గా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తార‌ని, ఇందుకు సంబంధించిన ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్ సీన్‌ల‌ని త్వ‌ర‌లోనే పూర్తి చేయ‌బోతున్నార‌ని తెలిసింది. ఇందు కోసం చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ మ‌రేడుమిల్లి ఫారెస్ట్‌కి వెళ్ల‌నున్నారని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All