విభిన్నమైన చిత్రాలతో కొత్త తరహా పాత్రలతో నటుడిగా, హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు హీరో సత్యదేవ్. తనని వెతుక్కుంటూ వస్తున్న ఏ అవకాశాన్ని కూడా ఆయన వదులు కోవడం లేదు. ఎలాంటి సినిమా అయినా.. ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ అయినా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే స్తున్నారు. సత్యదేవ్ కు తాజాగా మెగాస్టార్ చిరంజీవి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న `ఆచార్య` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ పునః ప్రారంభమైంది. కోకాపేట్లో ఈ మూవీ కోసం ఓ భారీ కాలనీతో పాటు టెంపుల్ సెట్ని నిర్మించారు. అక్కడే పలు కీలక ఘట్టాలతో పాటు కాజల్, చిరంజీవి పాల్గొనగా ఓ పాటని కూడా షూట్ చేశారు. ఇదిలా వుంటే మెగాస్టార్ ఈ మూవీతో పాటు మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` రీమేక్లోనూ నటించనున్న విషయం తెలిసిందే.
ఈ రీమేక్కు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. ముందు ఈ చిత్రానికి రమేష్ దర్శకత్వం వహించనున్నారు. ముందు ఈ రీమేక్ బాధ్యతల్ని సుజీత్కి అప్పగించారు. కానీ చిరుకి ఆశించిన అవుట్పుట్ రాకపోవడంతో ఆ స్థానంలోకి వి.వి.వినాయక్ ని తీసుకొచ్చారు. ఆయన వల్ల కూడా కాకపోవడంతో చివరికి మోహన్రాజాని రంగంలోకి దింపారు. ఫైనల్ అవుట్ పుట్ చిరుకి నచ్చడంతో మోహన్రాజాను ఫైనల్ చేశారు. అయితే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం సత్యదేవ్ని తీసుకున్నారట. ప్రత్యేకంగా చిరు ఫోన్ చేసి ఈ విషయాన్ని సత్యదేవ్కి చెప్పారని, ఆ కారణంగానే ప్రత్యేకంగా చిరుని కలిసి సత్యదేవ్ కృతజ్ఞతలు తెలిపారని తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.