Homeటాప్ స్టోరీస్హీరోయిన్ చార్మి ఇంట విషాదం..!

హీరోయిన్ చార్మి ఇంట విషాదం..!

హీరోయిన్ చార్మి ఇంట విషాదం..!
హీరోయిన్ చార్మి ఇంట విషాదం..!

హీరోయిన్‌, నిర్మాత చార్మి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. త‌న బంధువు చ‌నిపోవ‌డంతో తీవ్ర ఆవేద‌న‌కు గురైన చార్మి సోష‌ల్ మీడియా వేదిక‌గా భావోద్వేగంగా ఓ పోస్ట్‌ని షేర్ చేసింది. వ‌య‌సు పైబ‌డిన ఓ మ‌హిళ తో క‌లిసి దిగిన ఫొటోని షేర్ చేసిన చార్మి `ఇక మీరు లేర‌న్న మాట విన‌లేక‌పోతున్నా. కానీ జీవితంలో జ‌రిగేది జ‌ర‌గ‌క మాన‌దు. నిన్ననే మ‌నం చివ‌ర‌గా వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాం. కానీ ఇదే చివ‌రిది అవుతుంద‌ని భావించ‌లేదు` అని ఎమోష‌న‌ల్ పోస్ట్ షేర్ చేసింది.

`మీరు లేర‌ని తెలిసి మాట‌లు రావ‌డం లేదు. పైన స్వ‌ర్గంలో కూడా నీకు న‌చ్చిన‌ట్టుగా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటావ‌ని అనుకుంటున్నాను. పైన వున్న అప్పితో క‌లిసి ఎంతో అమూల్య‌మైన స‌మ‌యాన్ని గ‌డుపుతావ‌ని ఆశిస్తున్నా. నిన్ను నీ చిరున‌వ్వును మిస్స‌వుతున్నా. నా ప్రియ‌మైన ఆంటీ నీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నా` అని చార్మి పోస్ట్ చేసింది.

- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గన్నాథ్ తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రానికి పూరి, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తాతో క‌లిసి చార్మి ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ముంబైలో కీల‌క షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర తాజా షెడ్యూల్ హైద‌రాబాద్‌లో ప్లాన్ చేశారు. క‌రోనా కార‌ణంగా ఈ షెడ్యూల్ ని వాయిదా వేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All