టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. తనదైన మేనరిజమ్స్తో యంగ్ హీరోల్లోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో `అర్జున్రెడ్డి` సినిమాతో తనదైన ముద్రని వేసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని చేస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని చార్మి, పూరితో కలిసి కరణ్జోహార్, అపూర్వ మోహతా నిర్మిస్తున్నారు.
ముంబైలో కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసుకుని చిత్ర బృందం కరోనా వైరస్ ప్రారంభానికి ముందు హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఇదిలా వుంటే విజయ్దేవరకొండతో క్రష్ వుందని క్రేజీ హీరోయిన్లు వరుసగా స్టేట్మెంట్లు ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తనకు విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని వుందని వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇటీవల మరో హీరోయిన్ అమైరా దస్తూర్ కూడా విజయ్ దేవరకొండ అంటే క్రష్ వుందని, తనతో కలిసి హిందీ చిత్రంలో నటించాలని వుందని స్టేట్మెంట్ ఇచ్చి పలువురిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ జాఇతాలో అల్లరి నరేష్ హీరోయిన్ కూడా చేరిపోయింది. `జూనియర్స్` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షరీన్ ఆ తరువాత తెలుగు చిత్రాలకు దూరమైంది. తమిళ బిగ్బాస్ రియాలిటి షోతో మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ అంటే తనకు ఇష్టమని, అతనిపై క్రష్ వుందని చెప్పేసింది.