మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ కు అలాగే దేశవ్యాప్తంగా పార్లమెంట్ కు ఎన్నికలు జరుగనున్నాయి . దాంతో చంద్రబాబు పరిస్థితి ఏమౌతుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది ఎందుకంటే ప్రధానిగా మళ్ళీ నరేంద్ర మోడీ గెలిస్తే , ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఎప్పటి లాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా పవర్ లో ఉంటే చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ప్రస్తుత పరిస్థితి ని బట్టి చూస్తే అర్ధం అవుతోంది .
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న చంద్రబాబు ని ఇప్పటికే ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు కేసీఆర్ , జగన్ , మోడీ లు . జగన్ కు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో అధికారం దక్కలేదు కానీ మరో రెండు నెలల తర్వాత ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అంటూ అటు మోడీ ఇటు కేసీఆర్ లు వంత పాడుతున్నారు . ఇక జగన్ అయితే అధికారంలోకి వచ్చినట్లు చంద్రబాబు ని ఓ ఆట ఆడుకుంటున్నట్లు కళలు కంటున్నాడు . ఇలాంటి పరిస్థితిలో నిజంగానే రేపటి ఎన్నికల్లో మోడీ మళ్ళీ గెలిచి జగన్ ఎపి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు కు చుక్కలు చూపించడం ఖాయం , జైల్లో పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది .
English Title : Chandrababu naidu political life in dilemma