నేను జగన్ ని కలిస్తే చంద్రబాబు కి వచ్చిన నొప్పి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట కింగ్ నాగార్జున . నిన్న జగన్ ని లోటస్ పాండ్ లో నాగార్జున కలిసిన విషయం తెలిసిందే . అయితే అంతకుముందే జగన్ కు నాగార్జున కు మంచి స్నేహం ఉంది దానికి తోడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం నాగార్జున కు ఇష్టం లేదు కూడా . ఆ విషయాన్నీ పక్కన పెడితే నిన్న నాగార్జున కలిసిన విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి తెలియగానే ఒక ఆర్ధిక నేరగాడిని సినీ ప్రముఖులు కలవడం ఏంటి ? అని ప్రశ్నించాడు .
ఇదే ఇక్కడే నాగార్జున కు కోపం వచ్చింది . నేను జగన్ ని కలిస్తే బాబు వచ్చిన నష్టం ఏంటి ? నా కుటుంబ సన్నిహితుడు కాబట్టి కలిసాను తప్పేముంది అని తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసాడట నాగార్జున . ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు రానున్నాయి దాంతో కుర్చీల ఆట మొదలయ్యింది .
English Title: Nagarjuna comments on Chandrababu naidu