రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు , సీనీ నటుడు మాగంటి మురళీమోహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు గట్టి షాక్ ఇచ్చాడు . ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి మళ్ళీ పోటీ చేయాల్సింది పోయి నేను పోటీ చేయడం లేదు , అలాగే నా కోడలు కూడా తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేయడం లేదు అంటూ స్పష్టం చేసాడు . దాంతో తెలుగుదేశం వర్గాలు ఖంగుతిన్నాయి .
ఎన్నికల క్షేత్రంలో పోరాడి గెలవాల్సిన సీటుని ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని భావించిన మురళీమోహన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని చెప్పడమే కాకుండా ఈ విషయాన్నీ చంద్రబాబుకు కూడా చెబుతానని అంటున్నాడు . ఒకవైపు సర్వేలన్నీ జగన్ గెలవబోతున్నాడు అంటూ చెప్పుకొస్తున్నాయి . అంటే ఓటమి భయం పట్టుకుందన్న మాట మురళీమోహన్ కు . అందుకే పోటీ చేయను అని ప్రకటించాడు .
English Title: Rajahmundry MP Murali Mohan gives shock to chandrababu