Homeటాప్ స్టోరీస్సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దృశ్యం 2

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దృశ్యం 2

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దృశ్యం 2
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దృశ్యం 2

మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దృశ్యం చిత్రం చాలా భాషల్లోకి రీమేక్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ చేసాడు. తెలుగు వెర్షన్ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రానికి ఈ ఏడాది సీక్వెల్ వచ్చింది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అన్ని వర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది ఈ చిత్రం.

మరోసారి వెంకటేష్ సీక్వెల్ లో కూడా నటించాడు. దృశ్యం 2 టైటిల్ తోనే రూపొందిన ఈ చిత్రం షూటింగ్ కొన్ని నెలల క్రితమే పూర్తయింది. అదే కాస్ట్ అండ్ క్రూ తో ఒరిజినల్ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్ ను కూడా రూపొందించాడు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని మొదట ఓటిటిలో విడుదల చేస్తారన్న రూమర్స్ వచ్చాయి కానీ థియేటర్లలోనే విడుదల చేయాలని చివరికి నిర్ణయించుకున్నారు.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం దృశ్యం 2 సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికెట్ తో ఈ చిత్రాన్ని క్లియర్ చేసారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All