విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ లో నటించిన మలయాళ సూపర్ హిట్ దృశ్యం 2 సీక్వెల్ రీమేక్ షూటింగ్ కొంత కాలం క్రితమే పూర్తయింది. అయితే ఈ చిత్ర విడుదల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొన్ని వారాల క్రితం కరోనా థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో నిర్మాత సురేష్ బాబు ఓటిటి రిలీజ్ కు సముఖంగా ఉండి డీల్ కూడా సెట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో టాలీవుడ్ లో థియేట్రికల్ సిస్టం మళ్ళీ గాడిన పడుతోంది. ఇటీవలే వచ్చిన సీటిమార్ డీసెంట్ కలెక్షన్స్ ను సాధించింది. వచ్చే వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాలీవుడ్ మీటింగ్ జరుగుతోంది. దానిపట్ల చాలా పాజిటివ్ గా ఉన్నారు టాలీవుడ్ పెద్దలు.
కరోనా థర్డ్ వేవ్ వచ్చే సూచనలు కనిపించట్లేదు. దానికి తోడు కరోనాతో జీవించడం ప్రజలు అలవాటు చేసుకుంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో దృశ్యం 2 మళ్ళీ థియేట్రికల్ రిలీజ్ కోసం చూస్తోంది. ఈ నెలాఖరుకు దృశ్యం 2 విడుదల విషయంలో సురేష్ బాబు కీలక నిర్ణయం తీసుకోనున్నాడు.