బిగ్ బాస్ లో నిన్న మొత్తం టాస్క్ లతో నడిచింది. సోమవారమే కంటెస్టెంట్లను ఈగిల్స్, వోల్వ్స్ టీమ్స్ గా విభజించిన విషయం తెల్సిందే. లోబో, విశ్వ, ప్రియా, ప్రియాంక, హమీద, అన్నీ, ఉమా, శ్రీరామ్ మరియు షణ్ముఖ్ లు ఈగిల్స్ టీమ్ కాగా మిగిలిన వాళ్ళందరూ వోల్వ్స్ టీమ్ గా విభజించబడ్డారు.
మొన్నటి ‘పంతం నీదా నాదా’ టాస్క్ ను నిన్న కూడా కొనసాగించారు. ఈ టాస్క్ లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, అరుచుకోవడాలు బాగా జరిగాయి. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న షణ్ముఖ్, శ్రీరామ్ చంద్ర వంటి వారు కొంత యాక్టివ్ గా పాల్గొన్నారు. అలాగే సిరి, సన్నీ మధ్య గొడవ ప్రేక్షకులను కొంత చిరాకు పెట్టింది. విమెన్ కార్డ్ సిరి వాడుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యంగా అనిపించలేదు.
దాని తర్వాత బిగ్ బాస్ మరో రెండు టాస్క్ లను ఇచ్చాడు బిగ్ బాస్. ఒక టాస్క్ లో మానస్ టీమ్ గెలవగా మరో టాస్క్ లో ఏ టీమ్ కూడా విజేతగా నిలవలేకపోయింది. దీంతో బిగ్ బాస్ ఆ టాస్క్ ను రద్దు చేసాడు.