Homeన్యూస్భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పోలీసులు పెట్టిన కండిషన్లు ఇవే..

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పోలీసులు పెట్టిన కండిషన్లు ఇవే..

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పోలీసులు పెట్టిన కండిషన్లు ఇవే..
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పోలీసులు పెట్టిన కండిషన్లు ఇవే..

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు బుధువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరిపేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఈ మెగా ఈవెంట్ సోమవారం జరగాల్సి ఉండగా.. వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించే సరికి..భీమ్లా నాయక్ ఈవెంట్ ను వాయిదా వేశారు. ఇక ఈరోజు జరగబోయే ఈ ఈవెంట్ కు పోలీసులు పలు కండిషన్లు పెట్టారు.

ఆ కండిషన్లు ఏంటి అంటే..

- Advertisement -

* ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్దేశించిన పాసులు ఉన్నవారికే లోనికి అనుమతి

* ఫిబ్రవరి 21న ఈవెంట్ కోసం ఇచ్చిన పాసులు చెల్లవు. కొత్త పాసులు వున్నవారినే లోనికి అనుమతిస్తారు.

*వందల సంక్షలో వామనాలు వస్తే  సరైన పార్కింగ్ లభించడం కష్టం. వ్యక్తిగత వాహనాలలో కాకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా సభా స్థలికి చేరుకుంటే మంచిది.

* పాసులు లేనివారు గ్రౌండ్ వద్దకు వచ్చి గుమిగూడటానికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతి లేదు.

* పాసులు లేకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడొద్దు. దయచేసి పనులు లేని వారు రావద్దు.

* ప్రీ రిలీజ్ ఈ వెంట్ జరిగే ప్రాంతానికి పనులు లేకుండా వచ్చి గొడవ పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

* మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య యూసఫ్ గూడ చెక్ పోస్ట్.. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పరిసరప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం వుంది. కాబట్టీ వాహనదారులు ప్రత్యామ్నయ మార్గాలను ఎంకిచ చేసుకోవండీ.

*జూబ్లీ హిల్స్ రకోడ్ నెం. 5 నుంచి యూసఫ్ గూడా వైపు వెళ్లే వాళ్లు కమలాపురి కాలనీ రోడ్డును ఎంచుకోవాలి.

* అమీర్ పేట్ నుంచి యూసఫ్ గూడా మీదగా జూబ్లీ హిల్స్ వెళ్లే వారు గణపతి కాంప్లెక్స్ మీదుగా కమలాపురి కాలనీ రోడ్డు ఇందిరానగర్ మీదుగా వెళ్తే మంచిది.

* ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చి వారు తమ వాహనాలను నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే పార్క్ చేయాలి.  రోడ్డు మీద పార్క్ చేస్తే సీజ్ చేయడంతో పాటు తగిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ డేట్ మారడంతో మళ్లీ అదే సమయానికి వస్తారా లేదా అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ లో రానా విలన్ రోల్ లో నటిస్తుండగా ..పవన్ కు జోడిగా నిత్యా మీనన్ , రానా కు జోడి గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సాగర్ కే డైరెక్ట్ చేస్తుండగా…త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని యూ / ఏ సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All