Homeటాప్ స్టోరీస్స్టూవర్టుపురం బందిపోటుగా మారిన బెల్లంకొండ

స్టూవర్టుపురం బందిపోటుగా మారిన బెల్లంకొండ

స్టూవర్టుపురం బందిపోటుగా మారిన బెల్లంకొండ
స్టూవర్టుపురం బందిపోటుగా మారిన బెల్లంకొండ

బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు ఛత్రపతి రీమేక్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. వివి వినాయక్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 2022లో ఈ సినిమా విడుదలవుతుంది. ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈసారి యాక్షన్ థ్రిల్లర్ ను ఎంచుకున్నాడు మన బెల్లంకొండ హీరో.

స్టూవర్టుపురం ప్రాంతంలో ఒకప్పుడు బందిపోట్లకు మారుపేరుగా నిలిచిన టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తాడు. తన తండ్రి బెల్లంకొండ సురేష్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. ఈ సినిమాకు వినాయక్ శిష్యుడు కెఎస్ దర్శకత్వం వహిస్తాడు. అలాగే మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తాడు.

- Advertisement -

శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తాడు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. అయితే ఈ చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలన్న ఆలోచన ఉంది. ఛత్రపతి సినిమాను హిందీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అన్నదాన్ని బట్టి ‘స్టూవర్టుపురం దొంగ’ రేంజ్ ఆధారపడి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All