సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో వస్తున్న చిత్రం `అఖండ`. ప్రగ్యా సైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్తో పాటు టీజర్ని మేకర్స్ ఇటీవల విడుదల చేశారు.
గత కొన్ని నెలలుగా టైటిల్పై సస్పెన్స్ మెయింటైన్ చేసిన మేకర్స్ తాజాగా ఉగాది సందర్భంగా టైటిల్తో పాటు టీజర్ ని రిలీజ్ చేసి అభిమానులని సర్ప్రైజ్ చేశారు. విడుదలైన గంటల్లోనే ఈ టీజర్ రికార్డు స్థాయి వ్యూస్తో సంచలనం సృష్టిస్తోంది. బాలకృష్ణ అఘోరాగా పవర్ఫుల్ పాత్రతో పాటు మరో పాత్రలోనూ నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే 31ప్లస్ మిలియన్ల వ్యూస్ని రాబట్టి రికార్డు వ్యూస్ దిశగా పయనిస్తోంది.
టీజర్లో `కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది` అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ .. అఘోరా గెటప్లో ప్రత్యర్థుల్ని మట్టి కరిపిస్తున్న విజువల్స్ సినిమాపై
అంచనాల్ని పెంచేస్తోంది. ఈ నెల 30 వరకు నాన్ స్టాప్గా జరిగే షెడ్యూల్తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని మే 28న వరల్డ్ వైడ్గా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.