యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా స్టాయి చిత్రాలని ప్రకటిస్తూ ఇండస్ట్రీ వర్గాలకు షాకిస్తున్నారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడిక్ లవ్స్టోరీ`రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ తన 21వ చిత్రంగా `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్సన్లో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మాత సి. అశ్వనీదత్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ హాట్ ఫేవరేట్ దీపికా పదుకునే నటించనుంది. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి మెయిన్ హాట్ టాపిక్ దీపికా పదుకునే. ఇటీవల ఓ ఇంగ్లీష్ మీడియా తన కథనంలో తన స్థాయిని తగ్గిస్తూ ప్రభాస్ హీరోయిన్ అని సంబోధించడం తో వెంటనే రియాక్ట్ అయిన దీపిక తాజాగా మరో షాకిచ్చిందట. ఈ చిత్రం కోసం ప్రొడ్యూసర్ ఇప్పటికే హీరో ప్రభాస్కు అడ్వాన్స్ ఇచ్చే శారు. హీరోయిన్ దీపికకు కూడా అదే తరహాలో అడ్వాన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తే తిరస్కరించినట్టు తెలిసింది.
దీంతో టీమ్కి దీపికకు మధ్య ఏదైనా జరిగిందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ ప్రాజెక్ట్పై వున్న ప్రేమతోనే దీపిక అలా అడ్వాన్స్ని తిరస్కరించిందని చెబుతున్నారు. కరోనా క్రైసిస్ కాలంలో నిర్మాత ఇబ్బందులకు గురి కాకూడదని దీపిక భావిస్తోందట. ఆ కారణంగానే తను అడ్వాన్స్ తీసుకోవడం లేదని చెబుతున్నారు. సినిమా ప్రారంభమైన తరువాతే తన పారితోషికాన్ని తీసుకుంటానని చెప్పిందట. దీపిక ఈ చిత్రం కోసం 20 కోట్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే.