యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్, గోపీ కృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ని ఇటీవలే చిత్ర బృందం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని పాపులర్ చిత్రాలని పోలి వున్న ఫస్ట్లుక్పై విమర్శలతో పాటు ప్రశంసలు కూడా లభించాయి.
ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అంటూ ఇప్పటి వరకు ఎవరూ ఫిక్స్ కాలేదు. విజయ్ దేవరకొండ నటించిన సెన్సేషనల్ మూవీ `డియర్ కామ్రేడ్` ఈ చిత్రానికి తమిళ యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. అతని చేత `రాధేశ్యామ్` కోసం చిత్ర బృందం రెండు పాటలు చేయించింది. వాటి రికార్డింగ్ కూడా పూర్తయింది. అయితే సినిమా నేపథ్య సంగీతానికి, మిగతా పాటలకు సంగీతం ఎవరు సమకూరుస్తారనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే.
ఇప్పటి వరకు 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి తమన్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. టీసిరీస్ సంస్థ కూడా ఈ చిత్రానికి సహ భాగస్వామిగా వ్యవహరిస్తుండటంతో ఈ ప్రపోజల్ని యువీ వారి ముందు పెట్టినట్టు తెలిసింది. దీనికి వారు ఓకే చెబితే `రాధేశ్యామ్` ఆల్బమ్ టాప్లో వుంటుందని, లేదంటే `సాహో` తరహాలో అవుతుందని మేకర్స్ తమన్ని లైన్లోకి తీసుకొచ్చారని తెలిసింది.