Homeటాప్ స్టోరీస్`మ‌హా స‌ముద్రం`కు మ‌రో హీరోయిన్ ఫిక్స్‌!

`మ‌హా స‌ముద్రం`కు మ‌రో హీరోయిన్ ఫిక్స్‌!

`మ‌హా స‌ముద్రం`కు మ‌రో హీరోయిన్ ఫిక్స్‌!
`మ‌హా స‌ముద్రం`కు మ‌రో హీరోయిన్ ఫిక్స్‌!

`Rx100` ఫేమ్ అజ‌య్ భూప‌తి అనేక ప్ర‌య‌త్నాల త‌రువాత ఫైన‌ల్‌గా ఓకే అయిన చిత్రం `మ‌హా స‌ముద్రం`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ప‌ర్‌పై సుంక రామ‌బ్ర‌హ్మం ఈ భారీ మ‌ల్టీ స్టార‌ర్‌ని నిర్మిస్తున్నారు. శ‌ర్వానంద్ ఓ హీరోగా ఇప్ప‌టికే ఫైన‌ల్ అయ్యారు. ఆ త‌రువాత హీరో సిద్ధార్ధ ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.

తాజాగా ఈ భారీ మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ కోసం అదితీరావు ని ఓ హీరోయిన్‌గా చిత్ర బృందం ఇటీవ‌ల ఎంపిక చేసింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది కూడా దీంతో ఇందులో న‌టించే మ‌రో హీరోయిన్ ఎవ‌ర‌నే చ‌ర్చ మొద‌లైంది. తాజాగా ఈ చ‌ర్చ‌కు తెర‌దించుతూ మ‌రో హీరోయిన్ ని కూడా మేక‌ర్స్ ఫైన‌ల్ చేశారు. ఇందులో మ‌రో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్ న‌టించ‌బోతున్న‌ట్టు చిత్ర బృందం సోమ‌వారం ప్ర‌క‌టించింది.

- Advertisement -

ఇందులో హీరోయిన్‌ల పాత్ర‌లు కేవ‌లం పాట‌ల‌కు డ్యాన్సుల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాద‌ని న‌ట‌న‌కు ఆస్కారం వున్న పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని మేక‌ర్స్ ఇటీవ‌లే వెల్ల‌డించ‌డంతో అను ఇమ్మాన్యు‌యేల్ క్యారెక్ట‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగా వుండే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. వైజాగ్ నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ ని తెర‌పైకి తీసుకురానున్నార‌ట‌. డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All