యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మళ్లీ సూపర్స్టార్ మహేష్బాబుని బుట్టలో పడేశారా? అంటే టాలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరిద్దరి కలయికలో `సిరలేరు నీకెవ్వరు` చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇండయన్ ఆర్మీకి అంకితం ఇచ్చిన ఈ సినిమాతో తొలిసారి ఈ జోడీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
అనిల్ సుంకర్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కల్లోనూ రికార్డుల మోత మోగించింది. ఈ సినిమా తరువాత మళ్లీ అనిల్ రావిపూడి, మహేష్ బాబు కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. ఇటీవలే మహేష్ లైన్ విన్నారని, ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. మహేష్ ప్రభుత్వం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత అనిల్ రావిపూడి చిత్రం సెట్స్ పైకి రానున్నట్టు తెలిసింది.
పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం బ్యాకింగ్ వ్యవస్థ నేపథ్యంలో రూపొందుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు తెలిసింది.