సూపర్స్టార్ మహేష్ హీరోయిన్ అమృతారావు పండంటి బాబుకు జన్మనిచ్చింది. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరమైన అమృత తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచింది. సూపర్స్టార్ మహేష్ హీరోగా నటించిన చిత్రం `అతిథి`. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది అమృతారావు. ఆ తరువాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్కు వెళ్లిపోయింది.
బాలీవుడ్ కు వెళ్లిన అమృత అక్కడ భారీ చిత్రాల్లో నటించింది. అజయ్దేవగన్తో `ది లిజెండ్ ఆఫ్ భగత్సింగ్`, దీ వార్, మస్తీ, మై హూనా, వివాహ్ వంటి చిత్రాల్లో నటించింది. 2013 వరకు సినిమాల్లో నటిస్తూ యాక్టీవ్గా వున్న అమృత 2016లో రేడియో జాకీ అన్మోల్ని వివాహం చేసుకుని సినిమాలకు శాశ్వతంగా దూరమైంది.
గత కొంత కాలంగా ఫ్యామిలీకే పరిమితమైన అమృత ఇటీవల బేబీ బంప్తో కనిపించడంతో సోషల్ మీడియాలో అమృత ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ ఆదివారం అమృత ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి బాబుకు జన్మనిచ్చింది. తల్లితో పాటు బేబీ హెల్దీగా వున్నారని డాక్లర్లు వెల్లడించారు.