హీరో విజయ్ సేతుపతి సినిమాలో నన్ను హీరోయిన్ గా తొలగించారని , నేను తప్పుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ అమలా పాల్ . తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్న చిత్రంలో హీరోయిన్ గా మొదట అమలా పాల్ ని తీసుకున్నారు అయితే నిర్మాతకు అమలా పాల్ కు ఎక్కడో తేడా వచ్చింది దాంతో అమలా పాల్ ని తీసేసి మేఘా ఆకాష్ ని తీసుకున్నారు .
అయితే బయట అమలా పాల్ దే తప్పు అన్నట్లుగా ప్రచారం సాగడంతో స్పందించిన ఈ భామ నేను తప్పుకోలేదు ఆ చిత్ర నిర్మాతలే నన్ను తొలగించారు అంటూ బాంబ్ పేల్చింది . నేను ఇప్పటివరకు ఏ నిర్మాతని కూడా ఇబ్బంది పెట్టలేదు అలాంటిది నాపై అభాండాలు వేస్తున్నారు అంటూ ట్వీట్ చేసింది అమలా పాల్ . ఈ భామ నటించిన ఆడై టీజర్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే .
- Advertisement -