అడవి శేష్ హీరోగా నటించిన ఎవరు చిత్రం అల్లు అర్జున్ కు బాగా నచ్చిందట . ఎవరు బాగా నచ్చిందని ట్వీట్ చేసాడు అల్లు అర్జున్ . గతరాత్రి సినిమా చూసాను ,మర్డర్ మిస్టరీ తో తెరకెక్కిన ఎవరు చిత్రాన్ని అద్భుతంగా తీశారు . అడవి శేష్ హ్యాట్రిక్ కొట్టాడు, మంచి సినిమాలు చేస్తున్నాడు ఎవరు యూనిట్ కు నా శుభాకాంక్షలు అంటూ అభినందనలు తెలిపాడు అల్లు అర్జున్ .
ఈమధ్య విజయవంతమైన చిత్రాలను అభినందిస్తూ పోస్ట్ లు పెడుతున్నాడు అల్లు అర్జున్ . ఆగస్టు 15 న విడుదలైన ఎవరు చిత్రం యునానిమస్ గా హిట్ టాక్ సొంతం చేసుకుంది . అడవి శేష్ , రెజీనా కాసాండ్రా , నవీన్ చంద్ర తదితరులు నటించగా వెంకట్ రాంజీ దర్శకత్వంలో పివిపి ఈ చిత్రాన్ని నిర్మించారు . సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎవరు కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు .
- Advertisement -