అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన చిత్రం `ఎవరు`. గురువారం విడుదలైంది. పీవీపీ సినిమా నిర్మించిన చిత్రమిది.
వెంకట్ రామ్జీ దర్శకుడు. పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. సినిమా విడుదలైనప్పటి నుంచీ మంచి స్పందన వస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
దిల్రాజు మాట్లాడుతూ “సినిమా చూశాను.
చాలా బాగా నచ్చింది. ఇన్ని మలుపులతో ఆద్యంతం ప్రేక్షకుల్ని ఉత్కంఠతకు గురించేసిన సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు.
కథగా చెబుతున్నప్పుడు ఈ తరహా సినిమాల్ని నేను సరిగ్గా జడ్జ్ చేయలేను. కానీ సినిమా చూసినప్పుడు బాగా నచచుతాయి.
ఆసక్తికరమైన స్క్రీన్ప్లేతో అద్భుతంగా తీర్చిదిద్దారు.
అడివి శేష్ కెరీర్లో క్రమంగా ఎదుగుతున్నాడు. మా సంస్థలో అతనితో సినిమా చేస్తాం.
ప్రతిభ ఉంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేకుండానే రాణించవచ్చు.
నటుడిగా అడివి శేష్ విజయాలే అందుకు నిదర్శనం“ అని అన్నారు.
దర్శకుడు రామ్జీ మాట్లాడుతూ “మా నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. వారందరూ తమ వంతు కృషి చేసి, బెస్ట్ ఔట్పుట్ ఇవ్వడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది“ అని అన్నారు.
అడివి శేష్ మాట్లాడుతూ “దిల్రాజు గారు నిర్మించిన `ఎవడు` సినిమాలో విలన్గా నటించడానికి అప్పుడు ప్రయత్నించా. కానీ నాకు అవకాశం రాలేదు.
ఈ రోజు దిల్రాజు మా సినిమా యూనిట్ను ప్రశంసించడం ఆనందంగా ఉంది.
సినిమా చూసిన వెంటనే ఆయన నాకు ఫోన్ చేసి `మా బ్యానర్లో సినిమా ఎప్పుడు చేస్తావు` అని అడిగారు.
ఆ మాటలకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వారందరూ పాజిటివ్గా స్పందిస్తున్నారు. థ్రిల్ ఫీలయ్యామని చెబుతున్నారు“ అని అన్నారు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ “కేరక్టర్ ఆర్టిస్టుగా ప్రయత్నిస్తే పైకొస్తానని ఒకసారి దిల్రాజుగారు చెప్పారు.
అందుకే ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. సినిమా విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది“ అని తెలిపారు.
రెజీనా మాట్లాడుతూ “సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బావుందని ప్రశంసిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది“ అని చెప్పారు.