Homeటాప్ స్టోరీస్అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్‌?

అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్‌?

అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్‌?
అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్‌?

అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్‌కి ముందు అఖిల్ మ‌రో చిత్రాన్ని తాజాగా ప‌ట్టాలెక్కించారు. `ఏజెంట్‌` పేరుతో రూపొందుతున్న ఈ మూవీని స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. అనిల్ సుంక‌ర తో క‌లిసి సురేంద‌ర్‌రెడ్డి స‌రెండ‌ర్ 2 సినిమా బ్యాన‌ర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు.

బాండ్ మూవీస్ త‌ర‌హా క‌థా క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ గోవాలో మొద‌లైంది. ఇందు కోసం టీమ్ అంతా ఇప్ప‌టికే గోవాలో లాండ్ అయింది. ఇక్క‌డ భారీ షెడ్యూల్‌ని చేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో వుండగానే అఖిల్ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

- Advertisement -

ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌బోతున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం అజ‌య్ భూప‌తి `మ‌హా స‌ముద్రం` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఈ మూవీ పూర్త‌యిన త‌రువాత అఖిల్‌తో అజ‌య్ భూప‌తి త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All