అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీపై అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ మూవీతో బ్లాక్ బస్టర్ని దక్కించుకోవాలని అఖిల్, మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలని బొమ్మరిల్లు భాస్కర్ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇంత వరకు ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ఇంత వరకు ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇదిలా వుంటే ఈ చిత్రానికి బడ్జెట్కి మించి ఖర్చు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మొత్తాన్ని రికవర్ చేసుకోవడం కష్టమనే వాదన కూడా ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మూవీని మరింత పర్ఫెక్ట్గా అందించడానికి మేకర్స్ చాలా వరకు రీ షూట్లు చేశారట. ఆ కారణంగానే మూవీ బడ్జెట్ అనుకున్న దానికి మించి పెరిగిందని తెఉస్తోంది.