Homeటాప్ స్టోరీస్VFX కోసం అంత ఖ‌ర్చు చేస్తున్నారా?

VFX కోసం అంత ఖ‌ర్చు చేస్తున్నారా?

VFX కోసం అంత ఖ‌ర్చు చేస్తున్నారా?
VFX కోసం అంత ఖ‌ర్చు చేస్తున్నారా?

`బాహుబ‌లి` చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది విఎఫ్ ఎక్స్‌. దీని కార‌ణంగానే ఎపిక్ లుక్ ఈ సినిమాకు ఏర్ప‌డింది. దీని కోసం ఆర్కా మీడియా భారీ స్థాయిలో ఖ‌ర్చు చేసిన విష‌యం తెలిసిందే. మ‌కుట సంస్థ మెస్మ‌రైజింగ్ విజువ‌ల్స్‌ని అందించి ఈ చిత్రానికి గ్రాండీయ‌ర్ లుక్‌ని తీసుకొచ్చింది. ఇదే పంథాని ప్ర‌భాస్ తాజా చిత్రానికి అనుస‌రించ‌బోతున్నారా అంటే అవున‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌భాస్ తాజాగా అంగ‌క‌రించిన చిత్రం `ఆది పురుష్‌`. `త‌న్హాజీ` ఫేమ్ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్  ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహించ‌బోతున్నారు.

ప్ర‌తిష్టాత్మ‌క టి సిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా, ఓ విజువ‌ల్ ట్రీట్‌గా అందించ‌బోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌మొద‌లైంది. ఊహించ‌ని విధంగా ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌భాస్ ప్ర‌క‌టించ‌డం ప‌లువురికి ఇప్ప‌టికీ షాకింగ్ గానే వుంది. రామాయ‌ణ గాధ ఆధారంగా స‌రికొత్త పంథాలో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఇందులో శ్రీ‌రాముడిగా ప్ర‌భాస్ న‌టించ‌నున్నాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది. సీత పాత్ర‌లో కీర్తి సురేష్‌, రావ‌ణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టించ‌బోతున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది.

- Advertisement -

ఇక శూర్ప‌ణ‌క పాత్ర‌లో న‌టించ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని మంచు లక్ష్మి ప్ర‌క‌టించింది. ఇదిలా వుంటే వ‌చ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ చిత్ర వీఎఫ్ ఎక్స్ కోసం మేక‌ర్స్ 250 కోట్లు అంటే ఈ మూవీ బ‌డ్జెట్‌లో స‌గం కేటాయిస్తున్నార‌ని తెలిసింది. ఇంత భారీ మొత్తం విజువ‌ల్ ఎఫెక్ట్స్ కు కేటాయిస్తున్నారంటే ఈ మూవీ విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌పైకి రాబోతుండ‌టం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని ఫిల్మ్ ల‌వ‌ర్స్ చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All