యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంగళవారం ఫ్యాన్స్తో పాటు సగటు ప్రేక్షకుడికి సర్ప్రైజ్ ఇచ్చారు. ఊహించని స్థాయిలో.. ఊహకందని కథాంశం, పాత్రల నేపథ్యంలో తన 22వ చిత్రాన్ని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ప్రభాస్ తన 22వ చిత్రంగా `ఆదిపురుష్` చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్తో 3డీ ఫార్మాట్లో టిసీరీస్ అధినేతలు భూషన్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. `తన్హాజీ` ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ని మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ పోస్టర్లో పరశురాముడు, శ్రీరాముడు, హనుమంతుడు, రావణాసురుడు వంటి పాత్రలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని రామాయణ గాధ నేపథ్యంలో తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపిస్తారని చెబుతున్నారు. అయితే మరి సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసుడు, పరశురాముడు పాత్రల్లో ఎవు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పౌరాణిక గాధ నేపథ్యంలో రూపొంబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ ఓ భాగంలో మాత్రమే రాముడిగా కనిపిస్తారని, సినిమా `ఇండియానా జోన్స్` తరహాలో ట్రెజర్ హంట్ నేపథ్యంలో హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సాగుతుందని కొంత మంది చెబుతున్నారు.
ఒకే సారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం తెలుగు నటీనటుల్ని తీసుకుంటారా లేక మొత్తం బాలీవుడ్ నటీనటుల్నే ఎంచుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి సంబంధించి నెటిజన్స్ని, సామాన్య ప్రేక్షకుల్ని ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. వాటన్నింటికీ సమాధానం దొరకాలంటే మేకర్స్ వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే.