Homeటాప్ స్టోరీస్10 కోట్ల షేర్ సాధించిన ఎవరు

10 కోట్ల షేర్ సాధించిన ఎవరు

Evaru Collections
Evaru Collections

అడవి శేష్ హీరోగా నటించిన ఎవరు చిత్రం మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల షేర్ సాధించి సంచలనం సృష్టించింది .

ఆగస్టు 15 న విడుదలైన ఈ చిత్రానికి యునానిమస్ గా హిట్ టాక్ వచ్చింది . రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ గా పేరు తెచ్చుకున్న ఎవరు చిత్రం విడుదల అయ్యాక బయ్యర్లకు కూడా లాభాలు తెచ్చిపెడుతోంది .

- Advertisement -

మొదటి వారంలోనే 10 కోట్ల షేర్ రాబట్టడంలో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . రెజీనా కాసాండ్రా కు కూడా చాలా రోజుల తర్వాత కమర్షియల్ హిట్ రావడంతో ఉబ్బి తబ్బిబ్బై పోతోంది.

అలాగే ఎవరు చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచింది . దాంతో విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల రివార్డులు కూడా లభిస్తున్నాయి . ఇక అడవి శేష్ విషయానికి వస్తే …… సెలెక్టివ్ గా చిత్రాలను ఎంచుకుంటూ వరుస విజయాలు సాధిస్తున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All