ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. జిల్ ఫేమ్ రాధాకృష్ణకుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్టా మూవీస్ సమర్పణలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ని ఇటీవల చిత్ర బృందం విడుదల చేసింది. రొమాంటిక్ పిరియాడిక్ లవ్స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రభాస్ 21వ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్పై సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడానకి ఏర్పాట్లు చేస్తున్నారు. సైంటిఫిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా బాలీవుడ్ క్రేజీ లేడీ దీపికా పదుకునే నటించనుంది. ఈ విషయాన్ని ఇటీవలే చిత్ర బృందం ప్రకటించింది. పాన్ ఇండియాను మించి తెరపైకి రానున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ అయితేనే బాగుంటుందని నాగ్ అశ్విన్ భావించి ఆయనను సంప్రదించారట.
రెహమాన్ మాత్రం 4 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన డిమాండ్ని మేఊకర్స్ అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకే వేళ మేకర్స్ అంత పే చేయలేమంటే మాత్రం నెక్ట్స్ ఛాయిస్ కీరవాణి అని చెబుతున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో నిర్మితం కానున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రారంభం కానుందట. 2022 సమ్మర్లో చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.