మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ ఆనందంతో మురిసిపోయారు. తను ఎంతగానో ఇష్టపడే మేనమామ పవర్స్టార్ పవన్కల్యాణ్తో కలిసి ఆనందక్షనాల్ని పంచుకుంటూ ఫొటోలకు పోజులిచ్చి తన్మయత్వంతో మురిసిపోయాడు. ఈ క్యాండిక్ పిక్ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి కొణిదెల నిహారిక వివాహం మరికొన్ని గంటల్లో వరుడు జొన్నలగడ్డ చైతన్యతో జరగనున్న విషయం తెలిసిందే.
రాజస్థాన్ ఉదయ్పూర్లోని ఓబెరాయ్ గ్రూప్ ఉదయ్ విలాస్లో నిహారిక, చైతన్యల పెళ్లి హంగామా మొదలైంది. హైదరాబాద్లో నాగబాబు ఇంట ఐదు రోజుల క్రితమే పెళ్లికి సంబంధించిన సందడి స్టార్టయింది. పెళ్లి కూతురు కార్యక్రమంతో మెగా ఫ్యామిలీ ఇంట వెడ్డిండ్ హంగామా ఊపందుకుంది. పెళ్లి రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఉదయ్ విలాస్లో కావడంతో మెగా ఫ్యామిలీ జట్లు జట్లుగా ఉదయ్పూర్ చేరుకున్నారు.
ప్రతీ ఫ్యామిలీ ప్రత్యేక విమానాల్లో ఉదయ్పూర్ చేరుకున్నారు. సంగీత్ కార్యక్రమం జరిగింది. ఆ తరువాత మెహందీ వేడుకని నిర్వహించారు. సంగీత్లో పాల్గొనని పవన్కల్యాణ్ మెహందీ ఫంక్షన్కు హాజరయ్యారు. ఈ సమయంలో మెగా ఫ్యామిలీ హీరోలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఇదే సమయంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్తేజ్తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. మామా అల్లుళ్లకు సంబంధించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.