ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అవమానించాడు అంటూ సోషల్ మీడియాలో ఓ చర్చ సాగుతోంది దాంతో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అలాగే జగన్ వీరాభిమానులు మహేష్ బాబు పై ఆగ్రహంగా ఉన్నారు . ఇంతకీ మహేష్ బాబు పై వీళ్లకు కోపం ఎందుకో తెలుసా …….. విజయనిర్మల చనిపోయిన తర్వాత ఆమె పార్దీవ దేహానికి నివాళులు అర్పించడానికి , అలాగే కృష్ణ ని పరామర్శించడానికి వచ్చాడు ఏపీ సీఎం జగన్ .
అయితే ఆ సమయంలో మహేష్ బాబు కృష్ణ నివాసానికి రాలేదు , కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మాత్రం మహేష్ బాబు హాజరయ్యాడు . బాలయ్య తో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఫోటోలకు ఫోజిచ్చాడు కూడా అదే జగన్ వర్గీయులను కోపం తెప్పిస్తోంది . ముఖ్యమంత్రి జగన్ వస్తే మహేష్ రాలేదు కానీ మాజీ ముఖ్యమంత్రి వస్తే మాత్రం టక్కున హాజరయ్యాడు జగన్ ని అవమానిస్తావా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .