కరోనా వైరస్ ప్రతీ ఒక్కరినీ డిస్ట్రబ్ చేస్తోంది. యావత్ భారతాన్ని స్థంభింపజేసింది. దీని కారణంగా యావత్ దేశం యొత్తం లాక్ డౌన్ని విధించిన విషయం తెలిసిందే. దీని కారనంగా అన్ని వ్యవస్థలు స్థంభించిపోయాయి. ముఖ్యంగా దీని కారణంగా సినిమా వాళ్లకు భారీ నష్టం వాటిల్లుతోంది. సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి. థియేటర్లు బంద్ చేయబడ్డాయి.
ఇక ముఖ్యమైన వివాహ శుభకార్యాలకు కూడా కరోనా ఎఫెక్ట్ ఏర్పడింది. జన సమూహం ఎక్కువగా వుండే పెళ్లిళ్లు, సినిమా హాల్లు, ఫంక్షన్ హాల్లకు పోలీసుల నుంచి పర్మీషన్ రావడం లేదు. పబ్లిక్ ఫంక్షన్లు నిర్వహించకూడదని ఉత్తర్వులు వున్న నేపథ్యంలో ఈ నెల 16న జరగాల్సిన యంగ్ హీరో నిఖిల్ వివాహం కూడా ప్రశ్నార్థకంలో పడిపోయింది.
తను ప్రేమించిన డాక్లర్ పల్లవి వర్మతో నిఖిల్ ఈ నెల 16న వివాహం చేసుకోవాలని మూహూర్తం ఫిక్స్ చేసుకున్నాయి. అయితే కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ని మే 1 వరకు పొడిగించబోతున్నాయి. దీంతో నిఖిల్ వివాహం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వస్తే చివరికి గు్లో అయినా పెళ్లి చేసుకోవాలని నిఖిల్ అనుకున్నాడట. కానీ పెళ్లంటే వందల మంది బందువుల మధ్య చేసుకోవాల్సింది. అలాంటిది ఎలాంటి హంగామా లేకుండా చేసుకోవడం కరెక్ట్ కాదని ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాని నిఖిల్ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.