Homeటాప్ స్టోరీస్ఏ మాయ చేసావే సీక్వెల్.. తెలుగులో ఉంటుందా?

ఏ మాయ చేసావే సీక్వెల్.. తెలుగులో ఉంటుందా?

ఏ మాయ చేసావే సీక్వెల్.. తెలుగులో ఉంటుందా?
ఏ మాయ చేసావే సీక్వెల్.. తెలుగులో ఉంటుందా?

పదేళ్ల క్రితం విడుదలైన ఏ మాయ చేసావే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఈ మధ్యే ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ ఈ చిత్రాన్ని గుర్తుచేసుకున్నారు. నాగ చైతన్య, సమంత మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాతోనే చైతూ, సామ్ ప్రేమకు అంకురార్పణ జరిగిందన్న విషయం తెల్సిందే. తర్వాత ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఇప్పుడు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సో ఏ రకంగా చూసుకున్నా కానీ ఏ మాయ చేసావే అక్కినేని అభిమానులకు చాలా స్పెషల్ చిత్రం. దీని ద్వారానే సమంత తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. నాగ చైతన్య తన కెరీర్ లో మొదటి సూపర్ హిట్ ను అందుకున్నాడు. తెలుగులో నాగ చైతన్య – సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తమిళ వెర్షన్ లో శింబు, త్రిష నటించారు.

ఈ సినిమాకు తమిళ్ లో కల్ట్ గా పేరు వచ్చినా కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రూపొందించే సన్నాహకాల్లో ఉన్నాడు గౌతమ్ మీనన్. స్క్రిప్ట్ వర్క్ పూర్తైపోయిందని, శింబు డేట్స్ ఇస్తే షూటింగ్ కు వెళ్లడమే ఆలస్యమన్నట్లు మాట్లాడాడు గౌతమ్ మీనన్. శింబు హీరోగా కొనసాగుతుండగా త్రిష మాత్రం హీరోయిన్ కాదని తెలుస్తోంది. ఆమె స్థానంలో అనుష్కను హీరోయిన్ గా సెలెక్ట్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

- Advertisement -

మరి తమిళంలో ఈ చిత్రం ఉండనుండడం కన్ఫర్మ్ కావడంతో తెలుగులో ఈ సినిమా ఉంటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఆ మధ్య ఏ మాయ చేసావే గురించి తన అసంతృప్తిని బయటపెట్టాడు గౌతమ్ మీనన్. తాను తమిళ్ లో తీసిన క్లైమాక్స్ కాకుండా తెలుగులో హ్యాపీ ఎండింగ్ వచ్చేలా నిర్మాత ఇందిర తనపై ఒత్తిడి తెచ్చి ఒప్పించిందని చెప్పాడు మీనన్. అందుకే ఏ మాయ చేసావే చిత్రాన్ని తాను ఇష్టపడనని అన్నాడు. అందుకోసం ఈ సీక్వెల్ ను తెలుగులో కూడా తెరకెక్కిస్తాడా లేక డబ్బింగ్ వెర్షన్ తో సరిపెడతారా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All