ఆనందోబ్రహ్మ, యాత్ర వంటి డీసెంట్ హిట్స్ అందించి కేవలం రెండు చిత్రాలతోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు మహి వి.రాఘవ్.. లేటెస్ట్ గా ఆయన తన రెండో చిత్రం గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. అదియేమిటంటె మహి “సిండికేట్ ” అనే ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారని.. ఆ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త పివిపి (ప్రసాదే వి. పొట్లూరి) నిర్మిస్తారని హాట్ టాపిక్ న్యూస్ వినిపిస్తోంది. డైరెక్టర్ గా ఎలాంటి చిత్రాన్నైనా తీయగలనని నిరూపించుకున్న మహి వి.రాఘవ్ ఈ సిండికేట్ చిత్రాన్ని కూడా భారీ స్కేల్ లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ హీరోలు నటించనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2020లో స్టార్ట్ అవుతుందని సమాచారం!!
- Advertisement -